This Dialogue Between Krishna And Dhritharashtra After The Kurukshetra War Explains The Philosophy Of Karma!

Updated on
This Dialogue Between Krishna And Dhritharashtra After The Kurukshetra War Explains The Philosophy Of Karma!

భీకరమైన కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల తండ్రి దృతరాష్టృడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు.. కృష్ణా.. నా వంద మంది కొడుకులు నీ సాక్షిగా చనిపోయారు నీకు కొంతైనా బాధలేదా? నా శోకం నీకు అర్ధం కావడం లేదా?

శ్రీకృష్ణుడు: దృతరాష్ట్రా... నీకు గుర్తుందా 50 జన్మలకు పూర్వం నువ్వొక వేటగాడివి. అప్పుడు నువ్వు ఒక మగపక్షిని చంపడానికి ప్రయత్నించావు. కాని అది ప్రాణ భయంతో ఎగిరి పారిపోయింది.. ఆ పరిస్థితికి నువ్వు ఆగ్రహంతో ఊగిపోతు కనికరం లేకుండా కోపంతో పక్కన అప్పుడే పుట్టిన 100 పక్షి పిల్లలను చంపావు.. ఆ సమయంలో ఏమి చేయలేని స్థితిలో ఆ తండ్రి మగపక్షి చూస్తు ఉండిపోయింది. ఆరోజు నువ్వు చేసిన మహాపాపమే నిన్నుఈ పరిస్థితికి తీసుకువచ్చింది.

దృతరాష్టృడు: కాని దానికి నాకు 50 జన్మల సమయం ఎందుకు పట్టింది?

శ్రీకృష్ణుడు: నువ్వు ఆ పాపాన్ని కడిగేయడానికి నీకు పుణ్యం కావాలి, అందుకు వందమంది కొడుకులను కనాలి.. ఆ పుణ్యాన్ని నువ్వు 50 జన్మలలో సంపాదించావు.. కొన్ని అదే జన్మలో పాపానికి శిక్ష వేసి ప్రాయశ్చితం చేస్తే, కొన్ని మరుసటి జన్మలో చేస్తాను.నాకు ఎప్పుడు, ఏది, ఎలాచెయ్యాలో బాగా తెలుసు..!