All You Need To Know About Kakinada's Famed Sri Bhavanarayana Swamy Temple!

Updated on
All You Need To Know About Kakinada's Famed Sri Bhavanarayana Swamy Temple!

ఈ ఆలయానికి అతి పురాతన చరిత్ర ఉంది. ఒకసారి స్వర్గలోకంలో ఇంద్రుడితో పాటు కొంతమంది దేవతలు బ్రహ్మ దేవునితో సమావేశమైనప్పుడు శ్రీ మహావిష్ణువు మాయగురించి ప్రస్థావనకు వచ్చింది. కాసేపటికి సంభాషణల ద్వారా తెలుసుకున్నదేమిటంటే విష్ణుమాయను కనుగొనడం ఎవ్వరి తరం కాదని. ఐతే ఇదంతా నిశితంగా గమనిస్తున్న నారదమహర్షికి మాత్రం ఈ మాటలు అంతగా రుచించలేదు. నిత్యం నేను నారాయణుడి నామాన్ని జపిస్తాను నాకు నారాయణుడి మాయను తెలుసుకోవడం సులభం అని అక్కడ అన్నాడు. ఆ మాట సరాసరిగా శ్రీ మహావిష్ణువుకు చేరుతుంది. అప్పుడు నారదునికి తన మాయను తెలియజేయాలని ఒక నిర్ణయానికి వస్తాడు. కొంతకాలానికి నారదుడు భూలోకానికి వచ్చాడు. సంధ్యావందనం చేసుకోవాలని అక్కడే ఉన్న ఒక కొలనులో మునిగి లేచేసరికి నారదుడు ఒక మహిళగా మారిపోతాడు.. అక్కడికక్కడే నారదుడు తన శక్తులన్నీ కోల్పోయి, ఒక సాధారణ మహిళగా మారిపోయి గతాన్ని మరిచిపోతాడు.

11898931_10203494154515026_6390626205963370217_n
Bhavanarayana 1
9274632715_7362d17b2e_b

కొంతకాలం తర్వాత వివిధ పరిణామాలు సంభవించాక ఒకరోజు ఆకలితో అలమటిస్తూ అడవిలో ఉన్న ఒక చెట్టు పండును తెంపడానికి చాలా ఇబ్బందిపడుతుంటాడు. అక్కడికి మారువేషంలో శ్రీ మహావిష్ణువు చేరుకుని 'దగ్గరిలోని కొలనులో స్నానం చేసుకుని వచ్చేదాక నీకు ఆ పండు అందదు' అని చెప్పి నెమ్మదిగా కనపడకుండా మాయమవుతాడు.. నారదుడు పండును తినాలన్నా ఆశతో కొలనులో మునుగుతాడు.. "ఆశ్ఛర్యం నారదుడు తన మామూలు ఆకారంలోకి వచ్చేస్తాడు" ఆ తర్వాత ఇదంతా విష్ణుమాయ అని తెలిసి విష్ణుమాయను తెలుసుకోవడం ఎవ్వరితరం కాదనే నిజాన్ని తెలుసుకుంటాడు. తన తప్పుకు ప్రాయశ్చితంగా ఇంకా శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఇదే ప్రాంతంలో పాతాళ భావనారాయణ స్వామి ప్రతిమను ప్రతిష్టించి తపస్సు చేశాడట, ఆ తపస్సు ముగింపుకై నారాయణుడు వచ్చి ఈ మాయకు నిదర్శనంగా ఇక్కడే స్వయంభూ గా వెలిశారట.

59_big
efe
1236956_364488673683426_696611514_n
10403405_626669340798690_1147751077060343940_n

అసలు కాకినాడ అంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది.. అటు ఫుడ్ పరంగా, ఇటు అధ్యాత్మిక పరంగా, ఏ రకంగా చూసిన మన రాష్ట్రంలో అతి సుందరమైన ప్రదేశాలలో కాకినాడ కూడా ఉంటుంది. అలాంటి కాకినాడకు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరం అనే ఊరిలో ఉంది ఈ దేవాలయం. పురాతన కాలంనాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం చూస్తున్న ఈ గుడి సుమారు 500సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ దేవాలయానికి ముందు నారదుడు మునిగిన సరస్సుగా పేరుగాంచిన సరస్సు ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే 100 వైష్ణవ దేవాలయాలను దర్శించినంత ఫలం దక్కుతుందని ఆలయ పూజారులు చెబుతారు.

1504989_626669094132048_3383639052410676794_n
10857738_626668597465431_8452619103840308890_n
10599714_626669284132029_1931457555031606983_n
1235053_364489157016711_567204624_n