యాచకులు, యాచకులు.. గుడి మెట్ల దగ్గర కాదు.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గరా కాదు.. మన ఇంట్లో ఉంటారు, టీవీ లలో వస్తుంటారు
TRP కి బానిసలు మెరుగైన సమాజం కోసం, ప్రజల విజ్ఞానం కోసం అంటూనే.. అవసరమైన కథలను మరుగున పడేసి , అఙ్ఞానిని తెచ్చి జ్ఞానిని చేస్తారు.
వార్తలు తక్కువ , వాదనలు ఎక్కువ. కాంట్రవర్సీలంటే ఎంతో మక్కువ .
కత్తి కన్నా కలం గొప్పదంటూనే.. ఆ 'కత్తి' తో వ్యక్తుల్ని వ్యవస్థల్ని టార్గెట్ చేస్తుంటారు .
నిశీధిలో ఉన్న నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తామంటూనే ... వెలుగులో ఉన్న అబద్ధాన్ని నిజం చేసేస్తారు.
వదంతులు సృష్టిస్తారు, జీవితాలను బ్రష్టు పట్టిస్తారు.
బూతంటే ముద్దు , ముద్దంటే బూతు.
ఉన్నది ఉన్నట్టు చెప్తామంటూ .. ఉన్నవారి ఉంపుడుగత్తెలుగా .. రాజకీయం అనే చదరంగం లో పాలకుల పావులుగా మారుతున్నారు.
నైతిక ప్రవర్తన లేకుండా నమ్మిన నీతిని అమ్ముకుని , సమాచారం పేరుతో వ్యాపారం చేస్తున్నారు.
ఇప్పటికైనా 'దురాశ దుఃఖానికి చేటు' అనే సామెతను అర్ధం చేసుకుంటే బాగుపడతారు.